Featured

రాఘవేంద్రరావు, బాలయ్య కలయికలో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయని మీకు తెలుసా..!?

యువరత్న బాలకృష్ణ మాస్ డైలాగులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ఆయన పర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. 1974లో తమ సొంత బ్యానర్, ఎన్టీరామారావు దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మకల’ చిత్రంతో బాలకృష్ణ బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక అక్కడి నుంచి ఎన్టీ రామారావు చిత్రాలలో ఆయనకు కొడుకుగా, స్నేహితుడిగా నటించడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఎన్ టి.రామారావుతో కె.రాఘవేంద్రరావు ఓ చిత్రాన్ని నిర్మించారు.

1980, రామకృష్ణ సినీ స్టూడియోస్, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీరామారావు, శ్రీదేవి, బాలకృష్ణ, రాజ్యలక్ష్మి కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా, 1985 రామకృష్ణ సినీ స్టూడియోస్, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పట్టాభిషేకం’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించగా, చక్రవర్తి బాణీలు సమకూర్చారు. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

1986, కె.రాఘవేంద్రరావు సోదరుడు కె.కృష్ణ మోహన్ రావు నిర్మాణం, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అపూర్వ సహోదరులు’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ కలిసి నటించారు. బాలయ్య బాబు ఇందులో మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.

1987 ,కె.సి.శేఖర్ బాబు నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సాహస సామ్రాట్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ,విజయశాంతి కలిసి నటించారు. ఎన్నో వివాదాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డీలా పడింది.

1988, గోపి ఆర్ట్ పిక్చర్స్,కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘దొంగ రాముడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రాధ, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నిర్మాతలు బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో భారీ చిత్రాల నిర్మాత అశ్వినీదత్ ఆ విషయాలన్నింటినీ పక్కకు వదిలేసి రాఘవేంద్రరావు, బాలకృష్ణ కలయికలో ఒక సినిమా రూపొందించాలనుకున్నారు.

1992, అశ్వినీదత్ నిర్మాణం,కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అశ్వమేధం’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, నగ్మా, మీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరోగమనం పట్టింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చిట్ట చివరి చిత్రంగా ‘పాండురంగడు’ 2008 లో వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ, స్నేహ, టబు హీరో హీరోయిన్లుగా నటించారు. భక్తిరస చిత్రమైనప్పటికి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇలా రాఘవేంద్రరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

35 minutes ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

35 minutes ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

1 hour ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

2 hours ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

2 hours ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

3 hours ago