Featured

రాఘవేంద్రరావు, బాలయ్య కలయికలో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయని మీకు తెలుసా..!?

యువరత్న బాలకృష్ణ మాస్ డైలాగులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ఆయన పర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. 1974లో తమ సొంత బ్యానర్, ఎన్టీరామారావు దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మకల’ చిత్రంతో బాలకృష్ణ బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక అక్కడి నుంచి ఎన్టీ రామారావు చిత్రాలలో ఆయనకు కొడుకుగా, స్నేహితుడిగా నటించడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఎన్ టి.రామారావుతో కె.రాఘవేంద్రరావు ఓ చిత్రాన్ని నిర్మించారు.

1980, రామకృష్ణ సినీ స్టూడియోస్, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీరామారావు, శ్రీదేవి, బాలకృష్ణ, రాజ్యలక్ష్మి కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా, 1985 రామకృష్ణ సినీ స్టూడియోస్, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పట్టాభిషేకం’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించగా, చక్రవర్తి బాణీలు సమకూర్చారు. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

1986, కె.రాఘవేంద్రరావు సోదరుడు కె.కృష్ణ మోహన్ రావు నిర్మాణం, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అపూర్వ సహోదరులు’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ కలిసి నటించారు. బాలయ్య బాబు ఇందులో మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.

1987 ,కె.సి.శేఖర్ బాబు నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సాహస సామ్రాట్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ,విజయశాంతి కలిసి నటించారు. ఎన్నో వివాదాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డీలా పడింది.

1988, గోపి ఆర్ట్ పిక్చర్స్,కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘దొంగ రాముడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రాధ, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నిర్మాతలు బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో భారీ చిత్రాల నిర్మాత అశ్వినీదత్ ఆ విషయాలన్నింటినీ పక్కకు వదిలేసి రాఘవేంద్రరావు, బాలకృష్ణ కలయికలో ఒక సినిమా రూపొందించాలనుకున్నారు.

1992, అశ్వినీదత్ నిర్మాణం,కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అశ్వమేధం’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, నగ్మా, మీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరోగమనం పట్టింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చిట్ట చివరి చిత్రంగా ‘పాండురంగడు’ 2008 లో వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ, స్నేహ, టబు హీరో హీరోయిన్లుగా నటించారు. భక్తిరస చిత్రమైనప్పటికి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇలా రాఘవేంద్రరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago