IPL 2022: మళ్లీ విదేశాలకు ఐపీఎల్ టోర్నమెంట్.. పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ..!
IPL 2022: దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితులను మరోసారి తలికిందులు చేసేలా కనిపిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు ఇలాంటి భయాల్ని కల్పిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ లో పనిచేసే సిబ్బందికి దాదాపు 300 మంది పైగా కోవిడ్ బారిన పడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు… కోవిడ్ థర్డ్ వేవ్ ఎంతలా విరుచుకుపడుతోంది.
ఇలా దేశంలో ప్రతిరోజూ 1 లక్ష కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు వేవ్ నుంచి తప్పించుకోవడానికి నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్లు విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ కోవిడ్ వ్యాప్తి అనేది క్రికెట్ పై కూడా పడుతోంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్ లను కోవిడ్ కారణంగా రద్దు అయ్యే అవకాశం ఏర్పడింది.
బీసీసీఐ ఇప్పటికే అనేక దేశీయ టోర్నమెంట్లను రద్దు చేసింది. ఇక గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022పై కూడా ఈ ప్రభావం చూపుతోంది.
రాబోయే నెలల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని బీసీసీఐ నమ్మకంగా ఉంది. అయితే పరిస్థితి మరింత దిగజారితే టోర్నమెంట్ను విదేశాలకు తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సాధ్యమైనంతగా ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ బీసీసీఐ టోర్నమెంట్ను విదేశాలకు మరిస్తే మాత్రం.. ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఐపీఎల్ నిర్వహించడం వరుసగా ఇది మూడో సారి అవుతుంది. ఐపీఎల్ 2020 మొత్తం సీజన్ యూఏఈలో జరిగింది. 2021లో కూడా కరోనా కారణంగా.. ఇండియాలో కేవలం 30 మ్యాచ్లను నిర్వహించగలిగింది. అంతే కాదు.. కోవిడ్ 19 బయో-బబుల్ను ఉల్లంఘించినందున టోర్నమెంట్ను మేలో వాయిదా వేయవలసి వచ్చింది. ఇలా ఐపీఎల్ మాత్రమే కాకుండా.. దుబాయ్ లో 2021 టీ20 వరల్డ్ కప్ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా హోమ్ సీజన్లో వెస్టిండీస్ , శ్రీలంకలకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. దీని తర్వాతనే ఐపిఎల్కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…