Mahalakshmi: కోలీవుడ్ నిర్మాత లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడైతే వీరి వివాహం జరిగిందో ఒక్కసారిగా సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు. అధిక శరీర కాయం కలిగినటువంటి రవీందర్ ను మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి కేవలం డబ్బు కోసం మాత్రమే ఆయనను పెళ్లి చేసుకుంది అంటూ ఆయనని ట్రోల్ చేశారు.
ఇలా తనని బాడీ షేమింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.ఇలా వీరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు. ఇకపోతే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఇలా వివాహం తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ డిన్నర్ కి వెళ్ళగా అందుకు సంబంధించిన ఫోటోలను రవీందర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
నువ్వు నాకోసమే జీవించావు..
ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసినటువంటి ఎంతో మంది అభిమానులు మహాలక్ష్మి తల్లి కాబోతుందా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మహాలక్ష్మి ఈ ఫోటోలలో కాస్త బొద్దుగా కనిపించడమే కాకుండా బేబీ బంప్ లాగా తన పొట్ట ఉండడంతో చాలామంది ఆమె తల్లి కాబోతోందా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ఐ లవ్ యు చెప్పడంలోనే నా సంతోషం లేదు నేను చెప్పకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ రవీందర్ క్యాప్షన్ జోడించారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…