Senior Actress Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోను ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీలో మొదలు పెట్టి తెలుగులోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ, ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
చిరంజీవితో చేయమని హీరోయిన్స్ అనేవారు…
పునాదిరలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గారితో ఆ తరువాత వెంకన్న బాబు గారు చేసిన సినిమా ఊరికిచ్చిన మాట లో హీరోయిన్ గా చేయడానికి అప్పటి హీరోయిన్స్ అంగీకరించక పోవడం వల్ల కవిత గారికి ఆఫర్స్ వచ్చాయట. అలా వరుసగా సినిమాలను చిరు తో చేశారట. ఊరికిచ్చిన మాట, శ్రీరస్తు శుభమస్తు, ఆరని మంటలు, తాతయ్య ప్రేమలీలలు ఇలా వరుసగా చేశారు. ఇక బాలకృష్ణ తో నటించే అవకాశం రాలేదంటూ కవిత గారు చెప్పారు.
కవిత హీరోయిన్ గా చేస్తున్న సమయంలో బాలకృష్ణ ఇంకా అంత సినిమాలను చేస్తూ లేడని చెప్పారు. ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తున్నపుడు బాలకృష్ణ, హరికృష్ణ షూటింగ్ సెట్స్ కి వచ్చేవారు, సినిమాకు సంబంధిచిన పనులను చూసుకునేవారు అయితే మేకప్ లో ఎపుడూ బాలయ్యని చూడలేదు. ఆయన హీరో అయ్యాక అప్పటికే డైరెక్టర్స్ కోదండ రామిరెడ్డి వంటి వారు వచ్చేసారు ఇంకా హీరోయిన్స్ విజయశాంతి, రాధ, భానుప్రియా వచ్చేసారు అందువల్ల ఆయనతో చేసే వీలుపడలేదు అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…