Thottempudi Venu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తొట్టెంపూడి వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్వయంవరం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నటుడు వేణు ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.
ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వేణు ప్రస్తుతం ఇండస్ట్రీ దూరమయ్యారు.అయితే ఈ విధంగా వేణు ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వేణు గురించి మాట్లాడుతూ.. స్వయంవరం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సమయంలో ఆయనకు క్రమంగా ఆఫర్లు తగ్గిపోయాయి.
కెరీర్లు ఇంజనీర్ కావాలనుకున్న వేణు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారని అయితే ప్రస్తుతం తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో తన భార్యతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. 2001లో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఈమె మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేయడంతో ప్రస్తుతం తనతో కలిసి బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. రామాచారి అనే సినిమాలో వేణు చివరిసారిగా హీరోగా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ బావ గా కనిపించారు. ఇలా ఇండస్ట్రీలోఅన్ని రకాల పాత్రల్లో నటించడం పోవడమే అతనికి మైనస్ అయిందని దీని వల్ల తనకు ఆఫర్లు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారని అనంత ప్రభు తెలిపారు. అయితే తనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు పాత్రలు దొరికితే తప్పకుండా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…