General News

ఇరాన్ మీడియా సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు.. భయంతో యాంకర్ పరుగులు !

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా, ఇరాన్‌లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. ఈ దాడి సమయంలో, స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా, మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె భయంతో పరుగులు తీసింది. బిల్డింగ్ కదలడంతో కరెంట్ కట్ అయింది. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Israeli attacks on Iranian media outlets.. Anchors run in fear!

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని టెహ్రాన్‌కు టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడింది. చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలను కూడా ధ్వంసం చేసింది.

ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసేందుకు పనులు జరుగుతున్నాయని, ఇది తమకు ముప్పుగా భావించే ఇరాన్‌పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఈ దాడులు ఇరాన్‌లోని సైనిక, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితులు మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో, అంతర్జాతీయ సంఘం మధ్యవర్తిత్వం వహించి, ఇరుపక్షాల మధ్య శాంతి ఒప్పందానికి కృషి చేయాల్సి ఉంది. లేకపోతే, ఈ యుద్ధం మధ్యప్రాచ్య ప్రాంతంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా భయంకర పరిణామాలను కలిగిస్తుంది.

telugudesk

Recent Posts

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

2 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

2 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

2 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

2 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

2 weeks ago

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్! ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం – కారణాలు చూసి షాక్ అవుతారు

ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…

3 weeks ago