Naveen polishetty: బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టమని అన్నారు: నవీన్ పోలిశెట్టి
Naveen polishetty: కాలం మారుతున్న కొద్దీ సినిమాల్లో కథలు మారుతూ ఉంటాయి.అదేవిధంగా సినిమాలు చూసే అభిమానుల అభిరుచులు కూడా మారుతూ ఉంటాయి. అభిమానులు కూడా ఎప్పుడూ ఒకటే విధమైన కథలు కాకుండా రొమాంటిక్ గా, కామెడీ గా ఉన్న సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే లాజిక్స్ అయినప్పటికీ కామెడీ ఉంటే చాలు అని భావిస్తూ ఉంటారు అభిమానులు. ఇక ఆ కోవలో వస్తున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుండటం విశేషాలు. అలాంటి లాజిక్ కథనాలతోతెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న చిత్రం జాతి రత్నాలు.
హీరో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వం విషయం తెలిసిందే.. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ గా నటించి కడుపుబ్బా నవ్వించాడు నవీన్. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన నవీన్.. రెండో సినిమాగా జాతిరత్నాలు చేసి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
జాతి రత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ ఈ సినిమా విడుదల అయ్యి మార్చి 11 నాటికీ ఏడాది పూర్తి అయిన సందర్భంగా జాతిరత్నాలు తాజాగా చిత్రయూనిట్ సినిమా విశేషాలను మరోసారి గుర్తుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ నవీన్ పోలిశెట్టి. ఓ వీడియో షేర్ చేశాడు. జాతి రత్నాలు సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ మూవీ విడుదలయ్యే సమయానికి వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా అప్పటికే చాలా వరకు థియేటర్లన్నీ మూతపడ్డాయి.
అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మా సినిమా విడుదలైన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి సూపర్ హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపాడు నవీన్ పొలిశెట్టి. అనంతరం తన తండ్రితో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక్కడివే ఎలా రా అంటూ వాళ్ళ నాన్న తో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను అని తెలిపాడు నవీన్ పోలిశెట్టి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…