Naveen polishetty: బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టమని అన్నారు: నవీన్ పోలిశెట్టి
Naveen polishetty: కాలం మారుతున్న కొద్దీ సినిమాల్లో కథలు మారుతూ ఉంటాయి.అదేవిధంగా సినిమాలు చూసే అభిమానుల అభిరుచులు కూడా మారుతూ ఉంటాయి. అభిమానులు కూడా ఎప్పుడూ ఒకటే విధమైన కథలు కాకుండా రొమాంటిక్ గా, కామెడీ గా ఉన్న సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే లాజిక్స్ అయినప్పటికీ కామెడీ ఉంటే చాలు అని భావిస్తూ ఉంటారు అభిమానులు. ఇక ఆ కోవలో వస్తున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుండటం విశేషాలు. అలాంటి లాజిక్ కథనాలతోతెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న చిత్రం జాతి రత్నాలు.
హీరో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వం విషయం తెలిసిందే.. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ గా నటించి కడుపుబ్బా నవ్వించాడు నవీన్. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన నవీన్.. రెండో సినిమాగా జాతిరత్నాలు చేసి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
జాతి రత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ ఈ సినిమా విడుదల అయ్యి మార్చి 11 నాటికీ ఏడాది పూర్తి అయిన సందర్భంగా జాతిరత్నాలు తాజాగా చిత్రయూనిట్ సినిమా విశేషాలను మరోసారి గుర్తుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ నవీన్ పోలిశెట్టి. ఓ వీడియో షేర్ చేశాడు. జాతి రత్నాలు సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ మూవీ విడుదలయ్యే సమయానికి వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా అప్పటికే చాలా వరకు థియేటర్లన్నీ మూతపడ్డాయి.
అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మా సినిమా విడుదలైన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి సూపర్ హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపాడు నవీన్ పొలిశెట్టి. అనంతరం తన తండ్రితో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక్కడివే ఎలా రా అంటూ వాళ్ళ నాన్న తో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను అని తెలిపాడు నవీన్ పోలిశెట్టి.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…