తెలుగు బుల్లితెరపై మల్లెమాల సమస్థ నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్ లకు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఆదరణ లభించింది. బుల్లితెర నుంచి వెండితెరపై నటించే అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సందడి చేసే కొందరు కమెడియన్లు తరుచు పలు వివాదాస్పద కేసుల్లో ఇరుక్కున్నారు. గతంలో జబర్దస్త్ నటుడు వ్యభిచార కేసులో ఇరుక్కోగా తాజాగా మరొకరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న ఘటన చోటు చేసుకుంది.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుక్ అయినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.వీరి నుంచి రెండు నాటు తుపాకులు మూడు లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే అరెస్టయిన నిందితులను ఆరా తీయగా ఈ స్మగ్లింగ్ కేసులో నటుడు హరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. గతంలో కూడా నటుడు హరి పై కేసులు, స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన నటుడు హరి తనకు ఈ స్మగ్లింగ్ కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఈ విధంగా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై గతంలో తను పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల తను ప్రతీకారంగా ఇప్పుడు తనపై ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతూ, తనని ఒక స్మగ్లర్ గా ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…