General News

ఆనందయ్య మందు పవర్ ఫుల్.. దానితోనే కరోనా అంతం!

దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి ని కట్టడి చేయాలంటే ఆయుర్వేద మందు ఒకటే మార్గమని, ఆయుర్వేద మందుల ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలని కిస్కింద హనుమ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామిజీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్నటువంటి ఆయుర్వేద మందు వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయని స్వామీజీ పేర్కొన్నారు.

ఆనందయ్య కరోనా కట్టడి చేయడం కోసం తయారు చేసిన ఆయుర్వేద మందు ఆయుర్వేద గ్రంథాల ఆధారంగా తయారు చేశారని, ఈ మందులో ఎటువంటి లోపాలు లేవని, ఈ మందులలో ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా ప్రజలందరికీ అందించవచ్చని ఈ సందర్భంగా గోవిందానంద సరస్వతి తెలిపారు.

ఆనందయ్య తయారుచేస్తున్న ఈ ఆయుర్వేద మందు వల్ల ప్రజలకు ఎలాంటి హానీ లేదని,ఈ ఆయుర్వేద మందు ప్రజలందరికీ అందే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన స్వామీజీకి వేద పండితులు ఘన స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడిన గోవిందానంద సరస్వతి స్వామీజీ రాష్ట్ర ప్రజలందరూ ఈ మహమ్మారి బారిన పడకుండా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించడం కోసమే తిరుమల వచ్చానని ఈ సందర్భంగా తెలియజేశారు.త్వరలోనే హనుమన్ జన్మస్ధలంపై చర్చకు వస్తామని స్వామీజీ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

39 minutes ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

21 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

21 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

21 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

21 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

21 hours ago