Rohini: రోహిణి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఇదివరకు పలు బుల్లి తెర సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వెండి తెర సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇక ఈమె 2014వ సంవత్సరంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ సీరియల్ లో కమెడియన్ గా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచినందుకు ఈమెకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇలా ఈమెకు నంది అవార్డుతో పాటు పదివేల రూపాయల క్యాష్ ప్రైస్ కూడా 2018లో ప్రకటించారు.
ఇకపోతే తాజాగా ఈమెకు నంది అవార్డు రాబోతున్నట్లు ప్రకటించినటువంటి ఒక లెటర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాకు నంది అవార్డు ప్రకటించినందుకు చాలా సంతోషపడ్డాను ఇలా నంది అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉండేదని అయితే ఇప్పటివరకు నాకు నంది అవార్డు మాత్రం ఇవ్వలేదు అంటూ ఈమె తెలియజేశారు.
ఇప్పటివరకు నంది అవార్డు ఇవ్వలేదు..
ఇలా గత విషయాలను ఇప్పుడు ఈమె గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్టు ఫైనల్ గా మారడంతో పలువురు ఈ పోస్ట్ పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఇప్పటివరకు ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించలేదని పరోక్షంగా సెటైర్స్ వేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డు పేరులను గద్దర్ అవార్డులుగా మార్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ అవార్డులను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
https://www.instagram.com/actressrohini/p/C3QOFWSxn6U/
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…