Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కొన్ని జంటలు ఈ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి వారిలో సుధీర్ రష్మీ జంట ముందు వరుసలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో వర్ష ఇమ్మానియేల్ జంట ఉందని చెప్పాలి.వీరిద్దరూ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ ఈ జంటకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎన్నో స్కిట్ లలో కలిసి సందడి చేసిన వర్ష ఇమ్మానుయేల్ మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఈ జంటకు ఎన్నో సార్లు వేదికపై పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా వర్ష ఇమ్మానుయేల్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇమ్మానుయేల్ ను పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినటువంటి వర్ష తనని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్లను పాటించాలని వెల్లడించారు. ఇమ్మానుయేల్ పెళ్లి చేసుకోవాలంటే తనకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండాలని కండిషన్ పెట్టారు.
ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవడానికి వర్ష ఒప్పుకున్న సంతోషంలో ఇమ్మానుయేల్ తనకు నాగార్జున, చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి వారందరూ తెలుసని బిల్డప్ ఇచ్చారు.అయితే వారి సమక్షంలోనే పెళ్లి జరగాలని చెప్పగా ఇమ్మానియేల్ వేదికపై ఈ హీరోలకు డూపులను తీసుకురాగా వీరు కూడా వేదికపై పెద్ద ఎత్తున డాన్సులు చేశారు.మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. అయితే నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా లేదంటే ఎపిసోడ్ కోసమే ఇలా పర్ఫార్మన్స్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…