Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో జగన్ డైలాగ్.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటున్న మహేష్!
Mahesh Babu: పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లో భాగంగా మహేష్ బాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ డైలాగ్ చెప్పడం హైలెట్ గా మారింది.
ఈ ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించుకోవడం చూస్తుంటే తప్పనిసరిగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ లో భాగంగా మహేష్ బాబు చెప్పిన డైలాగ్ నేను ఉన్నాను… నేను విన్నాను అనే డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ అయ్యింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డైలాగ్ ఉపయోగించారు. ఈ ఒక్క డైలాగ్ అతని విజయానికి కీలకంగా మారిందని చెప్పాలి. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సినిమాలో జగన్ డైలాగ్ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు జగన్ పై ఉన్న అభిమానంతో తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టుకున్నారా? లేక తన పై సెటైర్ వేస్తున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాలో కామెడీ టైమింగ్, అదిరిపోయిందని ట్రైలర్ చెబుతోంది. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని మరోసారి నిరూపించిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి…
రోహిణి కార్తె వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన చాలామందిలో ఉంటుంది. ఎండలు మామూలుగా కాకుండా…
దో తరగతి ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ భయం కొన్ని సందర్భాల్లో తీవ్ర…
ఒక ప్రభుత్వ కార్యక్రమం అంటే నాయకులు వచ్చే వరకు వేచి ఉండడం మనం తరచూ చూసే దృశ్యం. కానీ ఒక…
భారత్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతి తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా…
ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలని, అదృష్టం కలగాలని అనేక మంది వాస్తు శాస్త్రం, ఫెంగ్ షూయ్ సూచనలను అనుసరిస్తుంటారు. వాటిలో…