Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో జగన్ డైలాగ్.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటున్న మహేష్!
Mahesh Babu: పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లో భాగంగా మహేష్ బాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ డైలాగ్ చెప్పడం హైలెట్ గా మారింది.
ఈ ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించుకోవడం చూస్తుంటే తప్పనిసరిగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ లో భాగంగా మహేష్ బాబు చెప్పిన డైలాగ్ నేను ఉన్నాను… నేను విన్నాను అనే డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ అయ్యింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డైలాగ్ ఉపయోగించారు. ఈ ఒక్క డైలాగ్ అతని విజయానికి కీలకంగా మారిందని చెప్పాలి. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సినిమాలో జగన్ డైలాగ్ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు జగన్ పై ఉన్న అభిమానంతో తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టుకున్నారా? లేక తన పై సెటైర్ వేస్తున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాలో కామెడీ టైమింగ్, అదిరిపోయిందని ట్రైలర్ చెబుతోంది. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…