Featured

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర రాజకీయాలపై ఎన్నోసార్లు విమర్శలు కురిపించారు.ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ లపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ జిల్లాలో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కే ఏ పాల్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల- జక్కాపూర్ సరిహద్దులో కేఏ పాల్ ను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే కె ఏ పాల్ పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. నేను రైతులను పరామర్శించడానికి వస్తే నన్ను మీరు అడ్డుకుంటున్నారు.తనను అడ్డుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్లి పోలీసులను సస్పెండ్ చేయిస్తానని ఈయన పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్!

ఈ విధంగా ఆ ప్రాంతంలో కె ఏ పాల్ పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కె ఏ పాల్ మాట్లాడుతూ పోలీసులు టిఆర్ఎస్ మనుషులని పోలీసుల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.కే ఏ పాల్ రాజన్న సిరిసిల్లకు వెళ్లకుండా టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా పోలీసులకు కేఏపాల్ మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి దూసుకు వచ్చి కేఏపాల్ చెంప చెల్లుమనిపించాడు.

పోలీసుల వ్యవహారం పై మండిపడ్డ పాల్..

ఈ విధంగా ఆ వ్యక్తి ఒక్కసారిగా కే ఏ పాల్ పై దాడి చేయడంతో పోలీసులు అతనిని దూరంగా తీసుకు వెళ్లారు.ఇలా పోలీసులు అతడిని అడ్డుకున్నప్పటికీ ఆయన తనపై రెచ్చిపోతూ కొట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కే ఏ పాల్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు డిఎస్పి సమక్షంలో తనపై ఇలా దాడి జరగడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. తెలంగాణ పోలీసులకు కేసీఆర్, కేటీఆర్ జీతాలు ఇస్తున్నారా? లేకపోతే ప్రజలు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నారా? అంటూ పోలీసుల వ్యవహార శైలిపై కూడా కె ఏ పాల్ ఘాటుగా విమర్శలు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

17 hours ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

18 hours ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

20 hours ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

20 hours ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

20 hours ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

20 hours ago