Categories: Political News

అంబటి రాంబాబుకు కీలక పదవి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్!

Jagan gives Ambati Rambabu a key post..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తిరిగి ఓ కీలక బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.

Jagan gives Ambati Rambabu a key post..

ఇటీవలి ఎన్నికల వరకు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటి, పార్టీని నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లిన నేతగా పేరొందారు. అయితే, ఈ ఏడాది జనవరిలో జగన్ ఆయనను సత్తెనపల్లి సమన్వయ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. రాజకీయంగా పక్కనబెట్టారని, ఇక ఆయనకు పెద్దగా చాన్స్ ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

అయితే, అంబటి రాంబాబు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, తనకు సంబంధించిన బాధ్యతల్ని నిర్వర్తించడంలో ముందుండి నడిచారు. ముఖ్యంగా జగన్ ఇటీవల చేసిన పల్నాడు జిల్లా పర్యటనలో అంబటి కీలక పాత్ర పోషించారు. ఈ టూర్ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదైంది.

ఈ నేపథ్యంలో ఆయనను గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించడాన్ని రాజకీయ పరిశీలకులు కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎంపీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు ఏసు రత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మేయర్ కావటి మనోహర్ లాంటి సీనియర్ నాయకులు ఇప్పటికే ఉన్నారు. ఈ నియామకంతో వీరందరూ అంబటికి సహకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చా అంశంగా మారింది.

ఇటీవలి ఎన్నికల సమయాల్లో చిలకలూరిపేట నుంచి విడదల రజినిని పోటీకి దింపిన జగన్.. ఇప్పుడు గుంటూరు వెస్ట్ బాధ్యతను అంబటికి అప్పగించడం, వచ్చే ఎన్నికల దృష్ట్యా ఓ వ్యూహాత్మక చర్యగా భావించాలి. దీంతో అంబటి రాంబాబు తిరిగి కీలక బాధ్యతల్లోకి రావడంతో పాటు, జగన్‌తో ఆయన సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని ఈ నియామకం ద్వారా స్పష్టమవుతోంది.

ఇది పక్కా సంకేతం.. పార్టీలో అనుభవజ్ఞుల పాత్రను మరిచిపోనని, వారికి సరైన సమయంలో సరైన స్థానాన్ని కట్టబెడతామని జగన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago