ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో హోంగార్డులుగా పని చేసే వారికి వరుస శుభవార్తలు చెప్పింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులుగా పని చేసే ఉద్యోగులలో అర్హులైన వారందరికీ ఇళ్లను కేటాయిస్తోందని అన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా రాష్ట్రప్రభుత్వం హోంగార్డులకు ఆరోగ్య ప్రయోజనాలను కల్పించే దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు.
రాష్ట్ర హోంగార్డుల 58వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 12,005 మంది అర్హులైన హోంగార్డులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు అయ్యాయని.. అర్హులైన మిగిలిన హోంగార్డులకు కూడా త్వరలో కార్డులు మంజూరు అవుతాయని వెల్లడించారు. ఈహెచ్ఎస్/ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి హోంగార్డుకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తున్నామని వెల్లడించారు.
మహిళా హోంగార్డులకు 90 రోజుల పాటు ప్రసూతి సెలవులను మంజూరు చేస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. సమాజానికి హోంగార్డులు విశేష సేవలను అందిస్తున్నారని డీజీపీ వెల్లడించారు. హోంగార్డులకు ఆకస్మిక మరణం సంభవిస్తే 30 లక్షల రూపాయల బీమా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. హోంగార్డులకు వేతనాలు భారీగా పెంచామని 21,300 రూపాయలు వేతనం చెల్లిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని హోంగార్డుల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో వేతనాల పెంపు, ప్రమాద బీమా వర్తింపు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 2021 సంవత్సరం జనవరి నుంచి హోంగార్డులు ఆకస్మిక మరణం పొందితే బీమా చెల్లిస్తామని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…