Featured

జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.. ప్యాకేజ్డ్ ‌వాటర్‌‌ లో అది తప్పనిసరి..?

మన దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ విక్రయాలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్యాకేజింగ్ చేసి విక్రయించే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ లో కాల్షియం, మెగ్నీషియం తప్పనిసరి అని కేంద్రం వెల్లడించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

ప్రముఖ కంపెనీలు మంచినీటిని శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా శరీరానికి అవసరమైన ఖనిజాలను మంచినీటి నుంచి తొలగిస్తున్నాయి. ఈ విషయం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ను కోరగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కేంద్రం అనుమతితో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ప్రముఖ కంపెనీలకు ఈ నెల 31వ తేదీలోగా కాల్షియం, మెగ్నీషియం ఇతర ముఖ్యమైన ఖనిజ లవణాలు మంచినీటిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని గడువును ఇచ్చింది. లీటర్ మంచినీటిలో 20 మిల్లీగ్రాముల కాల్షియం, 10 మిల్లీగ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లు నూతన నిబంధనలను అనుగుణంగా డ్రింకింగ్ వాటర్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని వెల్లడించాయి.

కిన్లే సంస్థ ఇప్పటికే క్యాల్షియం, మెగ్నీషియంలతో కూడిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కొత్త నిబంధనల వల్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగే వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

22 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

30 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

34 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

2 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

2 hours ago