దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి. వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడగా విద్యారంగంపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.
అయితే ఎన్ని రోజులైనా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాని నేపథ్యంలో జగన్ సర్కార్ విద్యాసంవత్సరం ప్రారంభం కోసం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించి ఈ ఏడాదికి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను కల్పించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో రాష్ట్రంలోను పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు.
ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల ఆధారంగా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు జరిగేవి. అయితే కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా పదో తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ప్రభుత్వం విద్యా సంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతో రెండో తేదీ నుంచి పాఠశాలల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒకరోజు 2,4,6.8 తరగతులకు మరో రోజు క్లాసులు జరుగుతాయని మంత్రి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…