General News

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ పంటలకు భరోసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారీ వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, వేరుశెనగ రైతులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు పత్తి, వేరుశెనగ పంటలను అధిక తేమ, గింజ నాణ్యత వంటి కారణాల వల్ల అధిక ధరకు విక్రయించలేకపోతున్నారు.

అలాంటి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా కేంద్రం నియమ నిబంధనల్లో మార్పులు చేసి రైతులకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేసింది. ఆర్బీకే కేంద్రాల్లో ఇప్పటివరకు టైం స్లాట్ విధానం ద్వారా రైతులు పంటను విక్రయించే అవకాశం ఉండేది. ఈ విధానంలో అనుకున్న సమయానికి కొనుగోలు కేంద్రానికి రైతులు పంటను తీసుకెళ్లకపోతే ఆర్బీకే కేంద్రాల్లో రైతులు మళ్లీ రిజిష్టర్ చేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది.

అయితే ఈ నిబంధనల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ తో సీజన్ లో ఎప్పుడైనా పంట వివరాలను నమోదు చేసే అవకాశం కల్పించింది. మారిన నిబంధనల ప్రకారం రైతులు ఏ రోజు పంటను అమ్మాలని భావిస్తే అదే రోజు ఆర్బీకే కేంద్రానికి తీసుకొని వెళ్లవచ్చు. సాధారణంగా నాఫెడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం 30 శాతం పంటను మాత్రమే నవంబర్ నెలలో రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది.

అయితే జగన్ సర్కార్ 75 శాతం పంటను రైతులు ఆర్బీకే కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తోంది. మార్కెట్ లో 60 శాతం గింజ ఉన్న్ వేరుశెనగను వ్యాపారులు రూ.3500కు కొనుగోలు చేస్తుంటే జగన్ సర్కార్ వేరుశెనగను రూ.4500కు కొనుగోలు చేస్తుండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

3 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

3 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

4 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

4 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago