Jamuna: వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున జనవరి 27వ తేదీ తన స్వగృహంలో మరణించారు. ఈమె అధిక వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం ఉదయం తన స్వగృహంలోనే మరణించారు. ఈ విధంగా జమున మరణించడంతో ఆమె సినీ కెరియర్ గురించి పలువురు ఎన్నో విషయాలను తెలియజేశారు. అలాగే జమున గారితో వారికున్న అనుబంధం గురించి కూడా గుర్తు చేసుకున్నారు.
ఇకపోతే జమున వయసు పై పడే కొద్ది ఆమె ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా, ఎక్కడ మాట్లాడినా కూడా చాలా వణుకుతూ మాట్లాడేవారు. ఈ విధంగా జమున వనుకుతూ మాట్లాడటానికి గల కారణాన్ని కూడా తెలియజేశారు. 1965 వ సంవత్సరంలో జమున లేత మనసులు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రమాదానికి గురయ్యానని ఆ ప్రమాదంలో తాను చనిపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయని ఈమె తెలియజేశారు.
ఈ సినిమాలో జమున తమిళ హీరో జయశంకర్ తో కలిసి నటించారు. ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ గడ్డివాము పై జరిగింది. అయితే ఈ పాటకు రిహార్సల్స్ చేస్తున్న సమయంలో గడ్డివాము పై ఉన్నటువంటి హీరో జయశంకర్ ఒక్కసారిగా కిందపడ్డారు అయితే గడ్డివాము కింద ఉన్న తన తలపై పడటంతో ఒక్కసారిగా తనకు బాగా నొప్పి కలిగిందని ఈమె తెలియజేశారు. ఇలా ప్రమాదం జరిగిన వెంటనే తాను డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి ఐస్ పెట్టుకొని మెడ అటు ఇటు తిప్పి పరీక్షించుకున్నానని తెలిపారు.’
అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలిసేది కాదు అయితే తనకు బాగానే ఉందని సినిమాలు చేస్తూ ఉండేదాన్ని. రాజపుత్ర సినిమా చేస్తున్న సమయంలో తనలో ఈ వణుకు మొదలైందని అప్పటికి ఎక్స్ రేలు కూడా అందుబాటులోకి రావడంతో ఒకసారి తల మొత్తం పరీక్ష చేయించుకోగా మెదడులో ఒక చిన్న నరం అతుక్కుపోయిందని దానిని సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ప్రస్తుతం తన పరిస్థితి బానే ఉంది కదా అని తాను సర్జరీ చేయించుకోలేదని జమున ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…