Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండ పలు సీరియల్స్ లో కూడా నటించారు. ECIL లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సులో కుడా పని చేసారు, ఒక 3 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన, ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
బ్రహ్మానందం తో గొడవ… 20 మంది కమెడియన్స్ తో మీటింగ్…
చాలా ఏళ్ల క్రితం సినిమాల్లో అందరు కమెడియన్స్ కి మంచి అవకాశాలతో ఈవివి, జంధ్యాల గారి సినిమాల వల్ల ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు. అలా జెన్నీ గారు చాలా మంది కమెడియన్స్ బ్రహ్మానందం, సుత్తివేలు, కోట శ్రీనివాస్రావు, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఏవిఎస్ వంటి వారితో కలిసి చాలా సినిమాల్లో చేసారు. ఇక అలాంటి సమయంలోనే బ్రహ్మానందంతో క్లాష్ వచ్చి వారందరూ కలిసి 20 మంది కమెడియన్స్ ఏవిఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి నేను వెళ్ళలేదు.
ఆ తరువాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో బ్రహ్మానందం కనిపించి మీటింగ్ కి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగారు. నిజానికి చెప్పాలంటే నన్ను అసలు ఎవరూ పిలవలేదు. ఒకవేళ పిలుచుంటే వెళ్ళేవాడినేమో తెలియదు. ఆ మీటింగ్ కి మీతో గొడవ జరిగిన వాళ్ళు వెళ్లారు నాకు మీతో గొడవ ఏం లేదు కాబట్టి నన్ను పిలవలేదేమో అని నిర్మొహమాటంగా చెప్పడంతో బ్రహ్మానందం అదీ నిజమేలే అని అన్నారు అని ఆ గొడవ గురించి జెన్నీ చెప్పారు. ఇక ఆ గొడవ చిరంజీవి వద్దకు వెళ్ళింది, ఆయన సర్దుబాటు చేసి మీడియా వరకు వెళ్ళకండి అని నచ్చజెప్పడంతో సద్దుమణిగింది అంటూ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…