Janhvi Kapoor: నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా షూటింగ్ పనులను మొదలుపెట్టలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించడం కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ చివరికి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం జాన్వీ హైదరాబాద్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె హైదరాబాద్ రావడానికి గల కారణం ఎన్టీఆర్ సినిమా కోసం ఫోటో షూట్స్ జరిగాయని దాదాపు ఈమె ఎన్టీఆర్ సినిమాలో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
ఇలా ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లేనని పలువురు భావిస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి కూతురు నటించిన బాలయ్య కాస్త చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి అనంతరం ఎన్టీఆర్ హీరోగా ఆయన సరసన హీరోయిన్గా నటించి వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు అందరి సరసన నటించిన శ్రీదేవి బాలకృష్ణ సరసన మాత్రం నటించలేదు. బాలకృష్ణ సినిమాలో శ్రీదేవిను హీరోయిన్ గా ఎంపిక చేసిన ఎన్టీఆర్ మాత్రం బాలయ్య సినిమాలో శ్రీదేవి నటించడానికి ఒప్పుకోలేదట.బాలకృష్ణ కూడా తన తండ్రితో కలిసి నటించిన శ్రీదేవి తనకు తల్లితో సమానమని అందుకే తనతో సినిమాలు చేయలేదని పలు సందర్భాలలో తెలియజేశారు. అయితే ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ ఎన్టీఆర్ సినిమాలో నటించడంతో ఎప్పుడైనా బాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే శ్రీదేవి గురించి ఎలా స్పందిస్తారనే విషయంపై అందరిలో ఆత్రుత నెలకొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…