General News

జులై 5 భయంతో వణికిపోతున్న జపాన్‌.. బాబా వాంగ అంచనాలతో జపాన్ లో కలకలం

జపాన్‌ ఇప్పుడు భయంతో వణికిపోతోంది. ప్రజలు ఊహించని ఉద్వేగానికి లోనవుతున్నారు. 2025 జులై 5 తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ఆ దేశంలో గందరగోళం పెరిగిపోతోంది. కారణం.. రియో టాట్సుకి అనే జపనీస్ కాలజ్ఞాని ఇచ్చిన ఒక హెచ్చరిక. ఆమె అంచనాల ప్రకారం జులై 5న జపాన్‌ తీరాన్ని భారీ సునామీ ముంచేయబోతోంది. ఈ ప్రకటనతో ప్రజల్లో భయం పెరిగింది. టాట్సుకిని “జపనీస్ బాబా వంగా”గా పిలుస్తారు. ఆమె చెప్పిన పలు అంచనాలు గతంలో నిజమవడంతో, ఈసారి కూడా ఆమె చేసిన హెచ్చరికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Japan is trembling with fear on July 5th..

రియో టాట్సుకి ఒక రచయిత్రి మరియు కాలజ్ఞాని. ఆమె 1999లో రాసిన “The Future I Saw” అనే పుస్తకంలో బహుళ భవిష్య వాణీలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈవెంట్స్ వాస్తవంగా జరిగినాయి.. ప్రిన్సెస్ డయానా మరణం, 2011 జపాన్ భూకంపం, సునామీ, COVID-19 వంటి సంఘటనలు. 2021లో ఈ పుస్తకాన్ని మళ్లీ ప్రచురించగా, అందులో 2025 జులై 5న జపాన్‌ దక్షిణ తీరంలో భారీ సునామీ వస్తుందని పేర్కొన్నారు.

టాట్సుకి ప్రకారం, ఈసారి వచ్చే సునామీ 2011లో జపాన్‌ను నాశనం చేసిన సునామీ కంటే చాలా పెద్దదై ఉంటుంది. నీటి అడుగున ఏర్పడే పేలుడు, అగ్నిపర్వతాల అశాంతి దీని కారణమవుతాయని ఆమె ఊహించారు. జపాన్-ఫిలిప్పీన్స్ మధ్య సముద్రంలో ఇప్పుడు పెద్ద బుడగలు కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

టాట్సుకి చేసిన ఈ భవిష్య వాణితో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జూన్ చివరి వారంలో హాంకాంగ్ నుంచి జపాన్‌కి బయలుదేరే విమాన టికెట్ల రిజర్వేషన్లు ఏకంగా 83 శాతం తగ్గిపోయాయి. టూరిస్టులు జపాన్‌కి వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో జపాన్ పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక వాణిజ్య, పర్యాటక శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

భూకంపశాస్త్రవేత్తలు, వాతావరణ శాఖలు మాత్రం టాట్సుకి అంచనాలను ఖండిస్తున్నాయి. “శాస్త్రీయంగా మేము భూకంపం, సునామీలకు ఖచ్చితమైన తేదీలు చెప్పలేము. టాట్సుకి చెప్పిన విషయానికి శాస్త్రీయ ఆధారం లేదు” అని జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది. జులై 5న సాధారణ వాతావరణం ఉంటుందని అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది.

అయితే గతంలో ఆమె కొన్ని అంచనాలు నిజమవడం వల్ల ప్రజలు టాట్సుకిని అశ్రద్ధగా తీసుకోలేకపోతున్నారు. కొందరైతే ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో టాట్సుకి భవిష్య వాణి వైరల్ అయింది. దీని ప్రభావంతో విమాన ప్రయాణాలు మాత్రమే కాదు, బహుళ రాష్ట్రాల్లో స్కూల్స్, ఆఫీసుల స్థాయిలో కూడా అప్రమత్తత పెరిగింది.

ఈ ఘటన మరోసారి మనకు ఒక విషయం గుర్తుచేస్తోంది.. భయం ఎప్పుడూ వాస్తవాలను కంటే వేగంగా పాకుతుంది. టాట్సుకి చేసిన భవిష్య వాణి ఎంతవరకు నిజమవుతుందనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. కానీ అప్పటికే ప్రజల్లో కలకలం, ప్రభుత్వ శాఖల్లో ఆందోళన మాత్రం తారాస్థాయికి చేరింది.

జులై 5కి ముందు జపాన్ ఓ అగాధపు అంచున నిలిచినట్టుంది.. అది ప్రకృతివైపరీత్యమేనా? లేక భయాన్ని కలిగించిన ఓ ఊహ మాత్రమేనా?

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago