Jayamaalini : ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్ చేస్తున్నారు. కొత్తగా ఎవరో ఒకరు ముంబై నుండి వచ్చిన మోడల్ చేస్తున్నారు. అయితే ఒకప్పట్లో లాగా ఐటమ్ సాంగ్ అంటే మాత్రం జ్యోతిలక్ష్మి, జయమలిని, డిస్కో శాంతి, అనురాధ ఇలా కొంత మంది గుర్తొస్తారు. అందులోనూ జ్యోతిలక్ష్మి, జయమాలిని అంటే అప్పట్లో ఐటమ్ సాంగ్ కే క్రేజ్ తెచ్చారు. ముఖ్యంగా జయమాలిని ఐటమ్ సాంగ్ ఉంటేనే అన్నట్లుగా సినిమాలను తీసిన రోజులు ఉండేవి. హీరోయిన్లకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకున్న జయమాలిని పెళ్లి తరువాత సినిమాలలో నటించడం మానేశారు. కేవలం కుటుంబానికి సమయం కేటాయిస్తూ హ్యాపీ గా ఉన్నారు. అయితే ఇటీవల జయమాలిని హైదరాబాద్ కి తనతో పనిచేసిన వారిని చూడాలని వచ్చి అందరినీ కలిశారు. అలా అనుకోకుండా పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయన కలిసినపుడు జరిగిన సంఘటనలను వివరించారు.
పవన్ కళ్యాణ్ కి సిగ్గు ఎక్కువ…
జయమాలిని గారు బాలకృష్ణ ను కలవడానికి ఆహా అన్ స్టాపబుల్ షో షూటింగ్ కి వెళ్లగా అక్కడ మామూలుగా బాలయ్య పలకరిస్తారని అనుకుంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడంటూ తెలిపారు జయమాలిని. బాలయ్య హగ్ చేసుకుని మాట్లాడి అక్కడున్న అందరికీ నా ఫస్ట్ హీరోయిన్ అంటూ పరిచయం చేశారట. అక్కడ అందరికి నా ఫస్ట్ హీరోయిన్ అని చెప్తా స్టేజి మీద చూస్తావా అని అడిగారట. ఇక అక్కడే పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో ఆయనను కలిసిన జయమాలిని ఆయన గురించి చెప్పారు.
పవన్ కళ్యాణ్ చాలా సిగ్గు పడతారు, తల వంచుకుని సైలెంట్ గా ఉన్నారు. ఆయన చేయి పట్టుకుని షోలో స్టేజి మీదకు వచ్చేటపుడు ఏమండి ఏమీ అనుకోవద్దు నేను మంచి అమ్మాయినే అనే సరికి ఆయన నవ్వారు. ఇక చివర్లో వెళ్ళేటపుడు మాట్లాడించారు బాగున్నారా అని, నేను మీరు బాగున్నారా అని అడిగి ఓ మీకు మాట్లాడటం వచ్చా అంటూ నవ్వాను అంటూ జయమాలిని పవన్ గురించి మాట్లాడారు. అన్ స్టోపబల్ ఎపిసోడ్ లో పవన్ తో పాటు జయమాలిని స్టేజి మీదకు వచ్చారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…