Reliance Jio రిలయన్స్ జియోతో పాటు ఇతర ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొన్ని రోజుల క్రితం తమ అనేక ప్లాన్ల ధరలను పెంచేశాయి. కొన్ని ప్లాన్లను నిలిపివేశారు కూడా. వాటితో పాటు సవరించిన ప్లాన్లను ప్రవేశపెట్టారు. తాజాగా ఆ ధరలను రిలయన్స్ జియో తగ్గించింది. వాటి వివరాలిలా ఉన్నాయి.
గత ఏడాది రూ. 499 ప్లాన్ ను రూ. 601 కి పెంచింది. తర్వాత దానిని మళ్లీ రూ.499కి తీసుకొచ్చింది. ఇక ఈ రూ. 499 ప్లాన్ ఇప్పుడు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. పరిమితి తర్వాత.. వినియోగదారులు 64kbps స్పీడ్ తో డేటాను అందిస్తుంది. ఈప్లాన్ ప్రస్తుతం ఇప్పుడు 28 రోజుల కాలవ్యవధితో రిలయన్స్ జియో అందిస్తోంది.
అంతే కాకుండా.. Jio నుండి జియోకి , జియో నుంచి నాన్ జియోకి అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు రోజుకు 100ఎస్ఎంఎస్ లు , జియో ప్రైమ్ మెంబర్షిప్ను అందిస్తుంది. రూ. 499 ప్లాన్ డిస్నీ + హాట్స్టార్ కాంబో సబ్స్క్రిప్షన్ను కూడా అందిస్తుంది. ఈ హాట్ స్టార్ ప్లాన్ అనేది ఎలాంటి రూపాయి కూడా చెల్లించకుండా సంవత్సరం వరకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. ఉచితంగానే జియ్ టీవీ, జియో సినిమా వంటివి జియ్ యాప్ కలిగిని వారికి యాక్సెస్ ఉటుందని పేర్కొంది.
రిలయన్స్ జియో వార్షిక ప్లాన్పై హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ వ్యవధిని రూ. 2,545కి పెంచుతుందని రిలయన్స్ జియో ప్రకటించింది. ఆఫర్ గతంలో జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 7 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ తేదీకి ముందు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు అదనపు ప్రయోజనాలను పొందగలరు. రూ. 2,545 ప్లాన్ అనేది అపరిమిత కాల్లు, రోజుకు 100 SMSలు మరియు 336 రోజుల వ్యవధిలో 1.5GB రోజువారీ డేటాను అందించే వార్షిక ప్లాన్. అయితే.. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్తో ప్లాన్ ఇప్పుడు అదనంగా 29 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇది సాధారణ 336 రోజులకు బదులుగా పూర్తి 365 రోజులకు ఉపయోగపడుతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…