Jordar Sujatha:తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన భాషతో ఒక్కసారిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జోర్దార్ సుజాత ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవడమే కాకుండా ఈ కార్యక్రమంతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో సందడి చేస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో లవ్ ట్రాక్స్ నిర్వహించడం సర్వసాధారణమే ఇలా లవ్ ట్రాక్ వల్ల ఎంతో మంది ఫేమస్ అవ్వగా వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఒకరు. అయితే వీరిద్దరూ కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వాలంటైన్స్ డే సందర్భంగా రాకింగ్ రాకేష్ జబర్దస్త్ వేదికపైనే సుజాత చేతివేలికి రింగు తొడిగి తన ప్రేమను బయటపెట్టారు.వీరిద్దరి నిజంగానే ప్రేమలో ఉన్నారని వీరి పెళ్లికి కుటుంబ సభ్యులకు కూడా అంగీకరించారని తెలియడంతో వీరిద్దరూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.అప్పటినుంచి రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత కలిసి ఎన్నో వీడియోలు చేయడం హాలిడే వెకేషన్ వెళ్తూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నారు. ఈ క్రమంలోనే జోర్దార్ సుజాత పెళ్లి కాకుండానే రాకింగ్ రాకేష్ ఇంటికి వెళ్లి తనకు కాబోయే అత్తయ్యతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లు ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పూజకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. రాకేష్ కుటుంబం బ్రాహ్మిన్స్ కుటుంబం.వారింట్లో ఇలాంటి పూజలు ఎంతో ఘనంగా చేస్తారని తనకు ఈ పూజ ఎలా చేయాలో తెలియకపోవడంతో ఈ ఏడాది రాకేష్ మదర్ తనని వరలక్ష్మి వ్రతానికి ఆహ్వానించడంతో వారింట్లో పూజ చేస్తున్నానంటూ ఈమె ఈ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…