Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య ‘జోష్’ సినిమాలో ఇండస్ట్రీ లో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచుకుంటూ ముందుకు వెళ్తున్న రవి ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాలో రైటర్ హర్షవర్ధన్ కి మధ్య చిన్న మనస్పర్తలు వచ్చినా ఆ సినిమాతో రవికి కమెడియన్ గా మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టమని, చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీ కి వచ్చానంటూ చెప్తుంటాడు.
మీలో ఎవరు కోటీశ్వరుడు లో చేస్తున్నపుడు చిరు అలా అన్నారు…
చిరంజీవి గారిని ఎంతో మంది అనుకరించగలిగినా జోష్ రవి అంత బాగా ఎవరు చేయలేరని ఇండస్ట్రీ లో అనుకుంటారు అంటూ రవి చెబుతూ అలా మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో చిరంజీవి గారి సినిమా కెరీర్ లోని మైలురాల్లు నాతో స్కిట్స్ లాగా చేయించారు. అది నేను మర్చిపోలేను. అయితే షోలో చేస్తున్నపుడు మొదటి సారి చిరంజీవి గారిని కలవడం మాట్లాడటం జరిగింది, ఆనందం తట్టుకోలేక పోయాను. అమ్మ నాన్న తరువాత నాకు చిరంజీవి గారే దేవుడు అలాంటి వ్యక్తిని కలవడంతో ఆ రోజుని వర్ణించలేను అంటూ చెప్తునే ఆ షోలో హోస్ట్ గా అనసూయ వచ్చారు షూటింగ్ ఎక్కువ ల్యాగ్ అవ్వడంతో నా షూటింగ్ పార్ట్ వాయిదా పడింది.
అప్పుడే సినిమాల్లో ఇంకా అవాకాశాలు వస్తున్నాయి, ఈ అవకాశం వదులుకోలేను అలా అని సినిమాల్లోను వదులుకోలేని పరిస్థితి. అప్పుడు చిరంజీవి గారు నా పరిస్థితి అర్థం చేసుకుని అక్కడి టీం కి ఒకటే చెప్పారు ఇతని డేట్స్ కి అడ్జస్ట్ అయ్యేలాగా మనకు కుదిరేలా ప్లాన్ చేయండి అంటూ చెప్పారు, ఆ రోజుని మర్చిపోలేను. ఇక వచ్చిన అవకాశం అందులోనూ నా అభిమాన హీరోతో అయ్యేసరికి ఒక్క షాట్ కుడా వృధా చేయకుండా ఎడిట్ చేసే వీలు కూడా ఇవ్వకుండా నటించాను అంటూ చిరంజీవి గారి మీదున్న అభిమానాన్ని చెప్పారు జోష్ రవి.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…