Jr NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.ఈయనకు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి ఆదరణ లభించింది. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ నవంబర్ ఒకటవ తేదీ కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కర్నాటక రత్న అవార్డును దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్టీఆర్ ను వేదికపై కూర్చొమని సూచించగా అక్కడే ఉన్నటువంటి ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా మూర్తి ఉన్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూర్చుని తుడిచి మరి సుధా మూర్తిని ఆకూర్చీలో కూర్చోబెట్టారు. ఈమెతో పాటు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని రాజ్ కుమార్ కికూడా ఇలాంటి గౌరవం ఇవ్వడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ దట్ ఇస్ ఎన్టీఆర్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన స్త్రీమూర్తులను గౌరవించే విషయంలో ఈయనకు ఎవరు సాటి లేరు అంటూ అభిమానులు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ తో తనకున్న అనుబంధం గురించి పునీత్ రాజ్ కుమార్ గురించి ఎంతో గొప్పగా వెల్లడించారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…