Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈయన తెలుగు సినీ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్లు కూడా చర్చించుకునే స్థాయికి ఎదిగారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న రాజమౌళి డాక్యుమెంటరీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రసారం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరిట ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో భాగంగా పలువురు సెలబ్రిటీలో రాజమౌళి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రాజమౌళికి కొంచెం కూడా సానుభూతి లేదని తెలిపారు. ఆయన ఓ సినిమా పిచ్చోడు ఆయనకు కావలసింది ఇచ్చి మనం వెళ్ళిపోవడమే అని తెలిపారు. ఇప్పటివరకు ఎవరు పరిచయం చేయని కథలను పరిచయం చేయడం కోసమే రాజమౌళి జన్మించారని తెలిపారు.
పని రాక్షసుడు..
ఇక రాంచరణ్ మాట్లాడుతూ.. రాజమౌళి గారి సినిమాలలో నన్ను నేను చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడినని తెలిపారు. ఇక ప్రభాస్ కూడా రాజమౌళి గురించి మాట్లాడారు. రాజమౌళి గారి లాంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు ఆయనకు సినిమాలు అంటే పిచ్చ ప్రేమ అని తెలిపారు. ఇక రమా రాజమౌళి కూడా మాట్లాడుతూ ఇప్పటివరకు రాజమౌళి గారితో పనిచేసిన వారందరూ ఆయనని పని రాక్షసుడు అంటారు అంటూ ఈమె వెల్లడించారు. ఇలా సెలబ్రిటీలందరూ రాజమౌళి గురించి చెబుతున్నటువంటి ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…