K. Viswanath: గత కొన్ని నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు నెలలలో ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు దిగ్గజ నటీనటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. గతవారం లెజెండరీ యాక్టర్స్ జమున మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె మరణ వార్త నుంచి బయటపడక ముందే టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ గారు కన్నుమూశారు.
ఈయన గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆఖరి శ్వాస వదిలారు. అయితే ఈయన చనిపోయే క్షణాల ముందు వరకు కూడా కళామతల్లికి సేవలు చేస్తూ కన్నుమూశారు.గురువారం రాత్రి ఈయన పాటలు రాస్తూ ఉన్నారు. అయితే ఉన్నఫలంగా ఈయనకు అనారోగ్యం చేయడంతో ఆ పాటను పూర్తి చేయమని తన కొడుకుకు చెప్పారు. ఇలా తన కుమారుడు పాట పూర్తి చేస్తుండగానే ఈయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇలా విశ్వనాధ్ గారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఇలా ఐదు దశాబ్దాలుగా తెలుగు కళామతల్లికి సేవలు అందించిన విశ్వనాథ్ గారు చివరి క్షణాలలో కూడా కళామతల్లికి సేవలు చేస్తూనే తుది శ్వాస విడిచారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విశ్వనాధ్ గారి మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులందరూ తరలివచ్చి ఈయనకు నివాళులు అర్పించారు. ఇక నేడు హైదరాబాద్ పంజాగుట్టలోని స్మశాన వాటికలో ఈయన అంత్యక్రియలను బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. ఈయన అంత్యక్రియలలో సినీ సెలబ్రిటీలపాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…