Chandra Mohan: కళాతపస్వి కే విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈయనని కడసారి చూడటం కోసం పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు తరలివచ్చారు. చంద్రమోహన్ కూడా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ విశ్వనాధ్ గారిని చివరిసారి చూడటం కోసం వచ్చారు.
ఇలా చంద్రమోహన్ విశ్వనాథ్ గారు నిర్జీవంగా పడి ఉండటం చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి వెక్కివెక్కి ఏడ్చారు. ఆయనని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన చంద్రమోహన్ గారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ సిరిసిరిమువ్వలు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈయన డప్పు కొట్టుకునే ఓ కళాకారుడి పాత్రలో నటించారు. ఈ సినిమా చంద్రమోహన్ సినీ కెరియర్ ను ఓ మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో చంద్రమోహన్ మాట్లాడుతూ తనకు తన సినీ కెరియర్లో బాగా సంతృప్తిని కలిగించిన చిత్రం సిరిసిరిమువ్వలని తెలిపారు.
ఈ విధంగా తన సినీ కెరియర్ ను ఓ మలుపు తిప్పిన కళాతపస్వి విశ్వనాథ్ గారు మరణ వార్తను చంద్రమోహన్ జీర్ణించుకోలేకపోయారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఓ గురువు మరణించడంతో ఆయన కడసారి చూపు కోసం నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఇద్దరి సహాయంతో అక్కడికి వచ్చి విశ్వనాథ్ గారిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈయన పార్తివదేహానికి నివాళులు అర్పించి ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఈయన అంత్యక్రియలు హైదరాబాద్ పంజాగుట్ట స్మశాన వాటికలో సాంప్రదాయ ప్రకారం జరిగాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…