Kajal Aggarwal:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమె బాడీ షేమింగ్కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఏడు నెలల గర్భిణి అని తెలుస్తోంది.
సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అవే మార్పులు కాజల్ అగర్వాల్ లో కూడా ఉన్నాయి. అయితే ఆమె హీరోయిన్ కావడంతో బాడీ షేమింగ్కు గురైంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ గురించి స్పందిస్తూ నా శరీరంలోనూ, నా ఇంట్లో పని ప్రదేశంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి వాటన్నిటిని ఆస్వాదిస్తున్నాను అంటూ ఫోటో షేర్ చేయడంతో ఈమె బాడీ షేమింగ్కు గురైంది.
ఇలా తన గురించి కామెంట్లు చేసిన వారిని చూసి చూడనట్టు వదలకుండా కాజల్ అగర్వాల్ తనదైన శైలిలో సదరు నెటిజెన్ కి కౌంటర్ ఇచ్చింది. నా శరీరంలో జరిగే మార్పులకు నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను ఇలాంటి సమయంలో చాలా మంది బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. ముందు మీరు బ్రతకండి ఇతరులను బ్రతక నివ్వండి అంటూ ఈమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే కాజల్ బాడీ షేమింగ్ కి గురవడంతో అటువంటి కామెంట్లపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సీరియస్ అవుతూ ట్వీట్ చేసింది. అదే విధంగా మంచు లక్ష్మీ కూడా కాజల్ కు మద్దతుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా సమంత కామెంట్స్ చేస్తూ… అప్పటికీ ఇప్పటికీ ఎంతో అందంగా ఉన్నావ్ అంటూ కాజల్ ని ఉద్దేశించి కామెంట్ చేసింది. ఇక మంచు లక్ష్మి స్పందిస్తూ… ప్రతి దశలోనూ ఎంతో ఫర్ ఫెక్ట్ గా ఉన్నావు… నీ చుట్టూ చాలా ప్రేమ ఉంది బేబీ అంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా హీరోయిన్ రాశి కన్నా సైతం మద్దతుగా నిలబడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…