Kakinada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామలగా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి మరో చరిత్ర సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆతరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఎలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండితెర, బుల్లితెర కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు ఇండస్ట్రీ గురించి ఇంకా రాజకీయాల గురించి వివరించారు.
ప్రజల డబ్బునే పంచిపెడుతూ అభివృద్ధి అంటున్నాడు…
కాకినాడ శ్యామల గారు మొదట రాజకీయాల్లోకి రావాలనుకుని కాంగ్రెస్ లో చేరాలని అనుకుని చివర్లో నాకు రాజకీయాలు సెట్ కావు నేను ఇమడ లేనని భావించి వెళ్ళలేదట. అయితే ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని, ఏపీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలంటూ చెప్పారు.
జగన్ పాలన బాగోలేదని, వస్తే నవరత్నాలు ఇస్తాడు ఏదో చేస్తాడు అని ఓటేసిన అందరినీ మోసం చేసాడు అంటూ చెప్పారు. ప్రజల నుండి తీసుకున్న డబ్బులో కొంత ప్రజలకే పంచిపెడుతూ అభివృద్ధి అంటే ఎలా. నీ సొంత డబ్బు ఏమైనా ఖర్చు పెడుతున్నావా, అయినా ఉచితాలు ఇస్తూ పోతే రాష్ట్ర అభివృద్ధి ఏమి కావాలి అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…