Kalyan Ram: బాలయ్య టాక్ షోకి కళ్యాణ్ రామ్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా.. అసలు విషయం చెప్పిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఆహాలో ప్రసారమవుతూ ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకొని రెండవ సీజన్ కూడా పూర్తి కావస్తోంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరు కాకపోవడం పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు నందమూరి హీరోలు అయినటువంటి కళ్యాణ్ రామ్ పాల్గొనలేదు. అలాగే మెగా హీరోలు అయినటువంటి రామ్ చరణ్ చిరంజీవి వంటి హీరోలు కూడా పాల్గొనలేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎందుకు పాల్గొనలేదు అనే ప్రశ్న తనకు ఎదురు కావడంతో తనకు ఆహా నుంచి ఆహ్వానం అందలేదని చిరంజీవి వెల్లడించారు.

ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ ఇదే ప్రశ్న ఆహా వారిని అడగాలి అంటూ సమాధానం చెప్పారు.

Kalyan Ram: బాలయ్య ద్వారా లాభాలను అందుకుంటున్న ఆహా…

ఇలా కళ్యాణ్ రామ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 3 మరి కొద్ది రోజులలో ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం కోసమే పలువురు సెలబ్రిటీలను సీజన్ వన్, టు లకు ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే గెస్ట్ ల ఎంపిక బాలయ్యదేనని ఇలా బాలయ్య ద్వారా ఆహా భారీ లాభాలను అందుకుంటున్నట్టు సమాచారం.