Senior Journalist Bhardwaja : ఈ మధ్య దిల్ రాజుకి రోజులు అసలు బాగోలేదేమో అనిపిస్తుంది. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఏ గొడవ జరిగినా చివరకు దిల్ రాజు వద్దకు వచ్చి నిలుస్తోంది. నిర్మాతల బంద్ అని సినిమా షూటింగులను ఆపేసి మళ్ళీ తన సినిమా మాత్రమే షూటింగ్ చేసాడు. ఇదేమని అడిగితే అది తమిళ సినిమా అని చెప్పాడు. ఇక విడుదల సమయంలో డబ్బింగ్ సినిమాను పండుగ అపుడు విడుదల చేయకూడదని తానే చెప్పి మళ్ళీ ‘వారసుడు’ సినిమా విడుదల చేసాడు. అదేమని అడిగితే అది ద్విభాష చిత్రం అని చెప్పాడు. ఇలా ప్రతి ఇష్యూలోనూ ఇరుక్కుంటున్న దిల్ రాజ ఇప్పుడు గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ తో పెట్టుకున్నాడు. ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
పరుశురాంతో గొడవ, సీన్ లోకి దిల్ రాజు…
అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలను పబ్లిక్ కు చెప్పాలనుకునే లోపే సీన్ రివర్స్ అయి ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకున్నారు, అసలు డైరెక్టర్ పరుశురాంతో గొడవ ఏమిటి అనే విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు. అల్లు అరవింద్ పరుశురాం డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలక్షన్ ముందే సినిమా వచ్చేలా ప్లాన్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్. కథ చర్చలు జరుగుతున్నాయి, ఆఫీసిషియల్ ప్రకటన కూడా వచ్చిన తరువాత కొద్దిరోజులకు పరశురాం దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఇదే అల్లు అరవింద్ కు పరశురాం పై కోపానికి కారణం. అల్లు అరవింద్ విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసీ అడిగినపుడు కూడా చెప్పకపోవడం అదీకాక పరుశురాం, దిల్ రాజు ఆఫీసియల్ ప్రకటన రాకముందే ఒకసారి తనకు చెప్పుండాలి కదా అనే అంశం వల్ల కోపం పెరిగింది. దిల్ రాజుని ముందు అడిగినపుడు కూడా ఏమీ చెప్పకుండా ఇలా చేసినందుకు ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేయాలనుకున్నాడు అల్లు అరవింద్.
అయితే వెంటనే పరుశురాం వెళ్లి క్షమాపణ చెప్పడం, అరవింద్ ఇక నీ లైఫ్ లో లేడు అన్నట్లుగా అరవింద్ గారు మాట్లాడటం, ఆపై దిల్ రాజు మాట్లాడటం వల్ల కొంత వెనక్కి తగ్గినా ఒక ఇష్యూ కోసం మీడియా ముందుకు వెళితే నిర్మాతల మధ్య ఉన్న సమస్యలు మరోసారి బయటకు వచ్చి ఒకటనుకుంటే ఇంకేదో అవుతాయని ఇతరులు సలహా ఇవ్వడంతో అరవింద్ వెనక్కి తగ్గారు. నిజానికి పరుశురాంకు బ్రేక్ ఇచ్చింది అల్లు అరవింద్ గారు ‘గీత గోవిందం’ సినిమాతో. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఆ సంస్థతో చేయాల్సి ఉంది అలాంటపుడు పరుశురాం ఇలా చేయడం అతని కెరీర్ మీద ప్రభావం చూపుతుంది అంటూ చెప్పారు భరద్వాజ.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…