భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని… అది ఒక భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని..ఆమె ఇటీవల అన్నారు.
దీంతో ఆ మాటలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ కంగనాపై మండిపడ్డారు. కంగనా ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కంగనాకు లేదన్నారు నారాయణ.
ఈ వ్యాఖ్యల పై ఆమె బానసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని.. దేశ ప్రజలకు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కంగనా ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ మధ్య కొన్ని కొన్ని విషయాలకు స్పందిస్తూ.. విమర్శలపాలు అవుతున్నారు.
దీనిలో భాగంగానే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు కూడా కొంతమంది ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక సీపీఐ నేత నారాయణ విషయానికి వస్తే.. అతడు కూడా ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 గురించి మాట్లాడుతూ.. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదని.. వీటిని వెంటనే బ్యాండ్ చేయాలని కోరిన విషయం తెలిసిందే.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…