మన ఇంట్లో ఏవైనా పాత వస్తువులు ఉంటే వెంటనే పడేయకండి. ఆ పాత వస్తువులలో ఎంతో విలువైనవి ఉంటాయని ఈ సంగతి తెలిస్తే మీకే అర్థమవుతుంది. పాత గిల్టు నగలు తనకు అవసరం లేదని భావించిన ఒక 70 సంవత్సరాలు మహిళ ఆ నగలను పడేయబోయింది. తీరాచూస్తే అవి 36 క్యారెట్ల వజ్రం అని తెలిసి ఎంతో ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఆ రాయి విలువ సుమారు 20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బ్రిటన్ కు చెందిన 70 సంవత్సరాల మహిళ తన దగ్గర పాత గిల్టు నగలు ఉండడంతో అవి తను ఎలాగో వేసుకోవడం లేదని వాటిని పడేయాలని ఫిక్స్ అయింది. ఆ మహిళ ఆ నగలను ఓ కార్ బూట్ సేల్లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ క్రమంలోని తన పక్కింటి వారు రావడంతో వారికి ఈ నగలను చూపించడంతో మరి ఇవేమీ అంత చెత్తగా లేవు వీటిని అమ్మితే కొంత డబ్బు వస్తుందని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ నగలను నార్త్ టైనెసైడ్.. నార్త్ షీల్డ్స్లోని ఫీటోన్బీ ఆక్షనీర్స్ సంస్థకు వెళ్లి తన నగలను వేలం వేయాలని భావించారు. అయితే ఆ మహిళ ఆ నగల బాక్సును తన పక్కింటి వారి దగ్గరే వదిలి వెళ్ళిపోయింది.అయితే ఆ నగలను డైమండ్ పరీక్షించే యంత్రంతో పరీక్షించగా అందులో ఉన్నది నిజమైన 36 క్యారెట్ల డైమండ్ అని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ రాయిని వజ్రాల నిపుణుడికి చూపించడంతో అది నిజమైన వజ్రం అని తేలింది. దాని విలువ సుమారు 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే దీనిని వేలం వేయగా మరింత ధర పలికే అవకాశం ఉందని ఈ వజ్రాన్ని నవంబర్ 30వ తేదీ వేలం వేయనున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…