భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని… అది ఒక భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని..ఆమె ఇటీవల అన్నారు.

దీంతో ఆ మాటలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ కంగనాపై మండిపడ్డారు. కంగనా ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కంగనాకు లేదన్నారు నారాయణ.
ఈ వ్యాఖ్యల పై ఆమె బానసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని.. దేశ ప్రజలకు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కంగనా ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ మధ్య కొన్ని కొన్ని విషయాలకు స్పందిస్తూ.. విమర్శలపాలు అవుతున్నారు.
దీనిలో భాగంగానే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు కూడా కొంతమంది ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక సీపీఐ నేత నారాయణ విషయానికి వస్తే.. అతడు కూడా ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 గురించి మాట్లాడుతూ.. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదని.. వీటిని వెంటనే బ్యాండ్ చేయాలని కోరిన విషయం తెలిసిందే.



























