Jaggesh: కన్నడ నటుడు జగ్గేష్ తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన ఆలోచనలను పంచుకుంటాడు. ఎప్పుడూ ట్విటర్లో యాక్టివ్గా ఉండే అతడు కేవలం సినిమాలకే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా సమాచారాన్ని అందజేస్తున్నారు. ఇలా అతడు తన అభిమానులకు దగ్గర అవుతూ ఉన్నాడు.
జగ్గేష్ వెండితెర కార్యక్రమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో కూడా బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అతడికి అదే డిమాండ్ ఉంది. చాలా బిజీగా ఉన్నప్పటికీ.. జగ్గేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటారు. తన ఆలోచనలకు పంచుకుంటూ.. సమస్యలను పంచుకుంటూ దగ్గర అయ్యాడు.
ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. సినిమాకు తక్కువ కాదనే రేంజ్ లో ఉంటుంది. అతడి జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఎన్నటికీ మర్చిపోలేము అన్నట్లు పేర్కొన్నాడు. అలాంటి కొన్ని సంఘటనలను ఆయన తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
మంగళవారం (జనవరి 5) ఆయన పెద్ద కుమారుడు గురురాజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఇది తన కొడుకు గురించి భావోద్వేగపూరితమైన పోస్టును ట్విట్టర్ లో పోస్టు చేశాడు. 1987 సంవత్సరంలో తాను తండ్రిని అయ్యానని.. అప్పడు తన దగ్గర చిల్లి గవ్వలేదని.. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలన్న భయం ఎక్కువగా వెంటాడిందన్నారు. అప్పడు ఆర్థికంగా తన కొడకుతో సమానంగా ఉన్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రిగా తాను ఓడిపోయానని.. దిక్కుతోచని స్థితిలో మంత్రాలయం గురురాయర ముందు నిలిచి నా గోడును చెప్పుకున్నా’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.ప్రస్తుతం అతడి ట్వీట్ వైరల్ గా మారింది..
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…