Kantamaneni Uma Maheswari : ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె అయిన కంఠమనేని ఉమా మహేశ్వరి సోమవారం అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఆకస్మిక మరణం నందమూరి కుటుంబం లో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం మధ్యాహ్నం ఆమె స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉమా మహేశ్వరి పార్థివదేహానికి పోస్టుమార్టం కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశారు.
గతంలో తన కళ్ళను దానం చేయాలని కోరిన ఉమా మహేశ్వరి…
నిన్న కన్నుమూసిన ఉమా మహేశ్వరి పార్థివదేహానికి పోస్టుమార్టం ముగిసాయి. అయితే ఈ క్రమంలోనే ఆమె కళ్ళను దానం చేశారు. గతంలో తాను చనిపోయిన తరువాత తన కళ్ళను దానం చేయాలని ఉమా మహేశ్వరి కుటుంబసభ్యులను కోరారట. అందుకే ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కళ్ళను దానం చేశారు.
ఇక ఉమా మహేశ్వరి కూతురు అమెరికా నుండి రావాల్సి ఉండగా, ఆమెరావడం ఆలస్యం అవుతుందన్న కారణంగా వైద్యులు భౌతిక దేహానికి ఎంబామింగ్ పక్రియను కూడా నిర్వహించారు. ఇకపోతే పోస్టుమార్టం రిపోర్టులకు మాత్రం మరో రెండురోజుల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…