Kantara Movie: కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. హోంభలే ఫిలిమ్ సమస్థ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు.
ఇక ఈ సినిమా పెద్ద ఎత్తున లాభాలను అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చేటటువంటి వరాహ రూపం అనే పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని చెప్పాలి.ఇలా ఈ సినిమా విడుదలయ్యి దాదాపు నెలరోజులు కావస్తున్న తరుణంలో ఈ సినిమా గురించి ఓ వివాదం చోటు చేసుకుంది.
ఈ సినిమాలో వరాహ రూపం అనే పాట కాపీ కొట్టారంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవరసం అనే పాట నుంచి వరాహ రూపం అనే పాటను కాపీ చేశారంటూ
తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపణలు చేయడమే కాకుండా ఈ కాఫీ ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వీరు హెచ్చరించారు.
ఈ విధంగా ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఈ విధమైనటువంటి కాపీ వివాదం తెరపైకి రావడంతో ఏం ఆశించి తైక్కుడం బ్రిడ్జ్ వారు ఆరోపణలు చేస్తున్నారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇలాంటి ఆరోపణలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ పాటపై కాపీ ఆరోపణలు రావడంతో ఇప్పటివరకు కాంతారా సినిమా చిత్ర బృందం ఏ విధంగాను స్పందించకపోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…