Kantharao Daughter Susila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన నాటకాల్లో ప్రసిద్ది చెంది ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అలాగే విలన్ గానూ నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన గురించి కుటుంబ విషయాలను కూతురు సుశీల రావు పంచుకున్నారు.
మా నాన్న ను గుర్తించండి…
సుశీలగారు తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి ఇద్దరు పెద్ద నటుల మధ్య నిలదొక్కుకున్న వ్యక్తి మా నాన్న. అప్పట్లో హీరోలంటే ముగ్గురే రామారావు, నాగేశ్వరావు, కాంతారావు కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వాళ్ళను తలుచుకుంటారు కానీ మా నాన్నను ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కాంతారావు గారి గురించి తెలుసుకోవాలి అని మా అభిప్రాయం. ఆయన బ్రతికిన్నపుడే ఇల్లు ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఆయన పోయాక మాకు ఇస్తారని అనుకోవడం లేదు.
కానీ ఆయన స్మరకంగా ఒక విగ్రహం అయినా నాన్న సొంత్తూర్లో అయినాకనీసం పెడితే బాగుంటుంది. మొదటి తెలంగాణ సూపర్ స్టార్ ఆయన అలాంటిది ఆయనను మరిచిపోతే ఎలా అంటూ మాట్లాడారు. ఇక సుశీల గారు మాట్లాడుతూ నాన్నకు సినిమా తప్ప ఏమీ తెలియదు, చనిపోయేవరకు సినిమాల్లోనే నటిస్తాను అనే వారు. మేము బ్రాహ్మణులం మాకు వ్యాపారం చేయడం పెద్దగా తెలియదు అందుకే ఆయన మరెక్కడా పెట్టుబడి పెట్టలేదు, కేవలం సినిమానే నమ్ముకున్నారు అంటూ ఆయన మంచి సినిమాలను చేసినా ఆయనను ఎవరూ గుర్తుచేసుకోరు, ఇప్పుడు అదే బాధగా ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యారు సుశీల గారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…