Surya Kiran: సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సూర్య కిరణ్ ఒకరు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించారు. అనంతరం సుమంత్ హీరోగా నటించిన సత్యం అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా దర్శకుడుగా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.
ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఈయన నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ పలు సినిమాలలో బిజీ అయ్యారు. అయితే వీరిద్దరూ నిర్మాతలగా మారి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి దీంతో ఆస్తులను కూడా అమ్ముకున్నారు.
ఇలా ఆస్తులు అమ్మడం నష్టాలు పాలు కావడంతో కళ్యాణికి తన భర్తతో మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు ఇలా తన భార్య తనకు కావాలని ఈయన కోరుకున్నప్పటికీ కళ్యాణి మాత్రం ఈయన నుంచి దూరంగా వెళ్లిపోయారు.. అయితే ఈయన అనారోగ్యానికి గురై జాండీస్ తో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.
ఒంటరితనమే చంపేసింది..
ఇక ఈయన మరణ వార్త గురించి నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. సూర్య కిరణ్ చనిపోయింది అనారోగ్య సమస్యతో కాదని ఆయన ఒంటరితనమే తనని చంపేసిందని తెలిపారు. కళ్యాణిని ఎంతో ప్రేమించారు. అయినా తను కాదనుకొని వెళ్లిపోవడంతో మందుకు బానిసగా మారిపోయాడు. రాత్రంతా తాగుతూనే ఉంటే ఏ ఆరోగ్యం కూడా సహకరించదని దాంతో ఈయన అనారోగ్యానికి గురై చనిపోయారు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…