Categories: FeaturedMovie News

నటుడు పునీత్ మరణంతో.. కర్ణాటకలో థియేటర్లు బంద్..!

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం జిమ్ చేస్తుండగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని భావించిన కుటుంబ సభ్యులు అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు.

విక్రమ్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ నటుడు పునీత్ మరణించారని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. పునీత్ మరణవార్త విన్న ఇండస్ట్రీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఈ క్రమంలోనే పునీత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడిందని పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

ఇదిలా ఉండగా నటుడు పునీత్ మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. హాస్పిటల్ ప్రాంతంతో పాటు వివిధ ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు.ఈ క్రమంలోనే అతని మృతికి సంతాపం తెలియజేస్తూ కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులపాటు థియేటర్లను మూసివేయాలని ఆదేశాలను జారీ చేసింది.

పునీత్ రాజ్ కుమార్ మరణం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు విక్రమ్ హాస్పిటల్ కు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇకలేరన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతని మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago