కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం జిమ్ చేస్తుండగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని భావించిన కుటుంబ సభ్యులు అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు.
విక్రమ్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ నటుడు పునీత్ మరణించారని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. పునీత్ మరణవార్త విన్న ఇండస్ట్రీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఈ క్రమంలోనే పునీత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడిందని పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
ఇదిలా ఉండగా నటుడు పునీత్ మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. హాస్పిటల్ ప్రాంతంతో పాటు వివిధ ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు.ఈ క్రమంలోనే అతని మృతికి సంతాపం తెలియజేస్తూ కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులపాటు థియేటర్లను మూసివేయాలని ఆదేశాలను జారీ చేసింది.
పునీత్ రాజ్ కుమార్ మరణం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు విక్రమ్ హాస్పిటల్ కు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇకలేరన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతని మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…