బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. మోనిత చనిపోలేదన్న నిజం ఎప్పుడు తెలుస్తుందో అని ప్రేక్షకులు బాగా ఆసక్తిగా చూస్తున్నారు. రేటింగ్ కూడా మొదటి స్థానం లోనే ఉంటుంది.
ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం. కార్తీక్ తో రత్నసీత ఇవాళ ఓ కొత్తమ్మాయి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి మోనిత పోలీస్ స్టేషన్ కు టీ పట్టుకుని వస్తుంది. అదే సమయంలో దీప కూడా వచ్చి మోనిత కనిపించిందని జరిగిన విషయాన్ని కార్తీక్ తో చెబుతుంది.
కార్తీక్ దీప మాటలను నమ్మలేకపోయాడు. మోనిత పక్కన ముసుగు వేసుకొని వీరి మాటలు వింటుంది. దీప మాత్రం మోనిత బతికే ఉందని, ఎలాగైనా పట్టుకుని వస్తాను అంటూ అనడంతో కార్తీక్ తన ఆవేశాన్ని ఓదార్చుతాడు. ఆలోచించుకోమని సలహా ఇస్తాడు.
వాళ్లు మాట్లాడుతుండగా మోనిత టీ ఇవ్వడానికి కార్తీక్ దగ్గరికి వస్తుంది. కార్తీక్ దీపకు ఇవ్వమంటాడు. అంతలోనే టీ గ్లాస్ జారిపడుతుంది. ఇక అక్కడికి పోలీస్ రావడంతో మోనితను ఎవరు అని అడిగేసరికి.. ఆమె మాట్లాడలేదని మూగ అమ్మాయని.. రత్నసీత పంపించిందని చెబుతాడు.
ఇక కార్తీక్ ను చూసుకుంటూ కార్తీక్ కు టీ ఇస్తుంది. కార్తీక్ ను అలాగే చూస్తూ ఉండిపోతుంది. టీ గ్లాస్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుండగా.. పోలీస్ ఆపి పగిలిన గ్లాస్ ముక్కలను తీయమంటాడు. ఇక మోనితకు గాజు ముక్క కాలికి గుచ్చుకోవడం తో అమ్మ అని అరిచి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
వెంటనే కార్తీక్ కు ఆమె మూగ అమ్మాయి అని.. కానీ అమ్మ అని అరిచింది అని అనడంతో ఆ విషయాన్ని దీపకు చెబుతాడు. దీప ఆమె మూగ అమ్మాయని అనేసరికి.. వెంటనే కార్తీక్ కు తనకు టీ ఇచ్చిన సమయంలో ఆ స్పర్శను, తన పర్సనాలిటీని చూసి మోనితనే అనుకుంటాడు.
ఆలోచనలో ఉన్న కార్తీక్ ను చూసి దీప ప్రశ్నించగా.. మోనిత అనే విషయాన్ని చెబితే వెంటనే వెళ్తుందని.. పోలీస్ స్టేషన్ లోకే అడుగు పెట్టిన మోనిత.. దీపను బతుకనిస్తుందా అనుకుంటూ దీపతో చెప్పలేకపోతాడు. వెంటనే రోషిణికి చెప్పాలనుకుంటాడు.
ఇక హాస్పిటల్ కి వెళ్ళిన రోషిణి మోనిత ఫోటోను చూసి గతంలో మోనిత మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అక్కడ ఉన్న డాక్టర్ ను మోనిత, కార్తీక్ ల మధ్య ఉన్న బంధం గురించి అడుగుతుంది.ఆ డాక్టర్ కూడా మోనితకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.
కానీ రోషిణి మోనితది కృత్రిమ గర్భమని విన్నాను మరి ఈ విషయం నిజమే అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తుంది. వెంటనే ఆ డాక్టర్ కూడా నిజమే అని ఎందుకంటే వాళ్ల మధ్య స్నేహం పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిందని అందుకే ఇలా చేసిందని అంటుంది.
కార్తీక్ ప్రేమ కోసమే ఇలా చేసిందని డాక్టర్.. రోషిణితో చెబుతుంది. అక్కడున్న ఒక పర్మినెంట్ ఉద్యోగిని పిలిపించి తనను ఎంక్వయిరీ చేస్తుంది. ఆమె కూడా మోనితకు సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతుంది. ఇక రోషిణి మోనిత ఫోటోను ఫోన్ లో తీసుకొని వెళుతుంది.
మరోవైపు సౌందర్య ఫోన్ మాట్లాడుతుండగా పిల్లలిద్దరూ తన తల్లి కోసం ఎదురుచూస్తారు. పిల్లల దగ్గరికి వెళ్లి ఏమైంది అని ప్రశ్నించగా పిల్లలు మళ్లీ తమ మాటలతో కోపం వచ్చేలా మాట్లాడుతుండగా.. సౌందర్య వెంటనే వాళ్లను బెదిరిస్తుంది.
ఇక తర్వాత ఎపిసోడ్ లో దీప ఆటోలో వెళుతూ మోనితను ఎలాగైనా వెతకాలి అని అనుకుంటుంది. మోనిత కూడా ఈరోజు రాత్రికే ఏదైనా చెయ్యాలి అని రత్న సీతతో అంటుంది. ఇక రోషిణి కార్తీక్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…