సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరో హీరోయిన్లు వస్తుంటారు వెళుతుంటారు. అయితే కొందరు మాత్రం నటించినది కొన్ని సినిమాలలో అయినప్పటికీ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుని ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో మీరా జాస్మిన్ ఒకరు.
పెద్ద పెద్ద కళ్ళతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఇండస్ట్రీ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. తమిళం మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన మీరాజాస్మిన్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైపోయారు.
ఈ విధంగా తెలుగులోకి “రన్ ” సినిమా ద్వారా పరిచయమైన ఈమె భద్ర,అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, పందెంకోడి వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.ఈ విధంగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే మీరాజాస్మిన్ 2014వ సంవత్సరంలో అనిల్ జాన్ టైటాన్ అనే ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయ్యారు.
ఈ విధంగా కొద్దిరోజులపాటు ఈమె వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడిచినప్పటికీ తన భర్త నుంచి పలు మనస్పర్ధలు విభేదాలు రావడంతో తన భర్త నుంచి దూరమయ్యారు. ఈ క్రమంలోనే తిరిగి తన దృష్టి మొత్తం ఇండస్ట్రీ వైపు మళ్ళించారు.
తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమె తన శరీరంపై దృష్టి పెట్టి ఎక్కువ వర్కౌట్ చేస్తూ బాగా సన్నబడ్డారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…