బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను అసలు వదలడం లేదు. అంతేకాకుండా రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. కార్తీక్ రోషిణి దగ్గరికి వచ్చి మోనిత బతికే ఉందన్న విషయాన్ని చెప్పేసరికి ఇటువంటి కట్టు కథలు చెప్పకండి అంటూ కార్తీక్ పై ఫైర్ అవుతుంది. మీరు అంత జెంటిల్మెన్ అయితే మీ భార్యను ఎందుకు దూరం పెట్టారని ప్రశ్నిస్తుంది.
వెంటనే కార్తీక్ కోపంతో మోనిత వల్లే అంటూ అరుస్తాడు. మోనిత క్రిమినల్ అని గట్టిగా అనడంతో.. ఆ క్రిమినల్ ను ఎందుకు చంపారు అంటూ.. ఎక్కడ ఉందో అని చెప్పు అంటుంది. కార్తీక్ కూడా తను హత్య చేయలేదన్న విషయాన్ని గట్టిగా చెబుతాడు.
ఇక శ్రావ్య.. ఆదిత్య దగ్గరికి వచ్చి కార్తీక్ ని ఎందుకు చూడటం లేదు అంటూ గట్టిగా అరుస్తుంది. ఫ్రెండ్స్ తో గంటలకొద్దీ మాట్లాడుతావు అంటూ అంతేకానీ అన్నయ్య దగ్గరికి వెళ్లడానికి టైం లేదా అంటూ కోపంతో మాట్లాడుతుంది.
శ్రావ్య మాట్లాడిన మాటలకు ఆదిత్య అందరిపై బాగా ఫైర్ అవుతాడు. అన్నయ్య జీవితాన్ని మనమే ఇలా చేశాము అంటూ అనేసరికి సౌందర్య కోపంతో రగిలిపోయి అలా అంటున్నావ్ ఏంటి అని ప్రశ్నిస్తుంది.
దీప వారణాసి ఆటోలో మోనిత ఇంటికి వెళుతుంది. అక్కడున్న వాళ్ళని మోనిత గురించి అడిగేసరికి మోనితను చనిపోయిందని అనుకుంటుంది. తనకు మోనిత కనిపించడం భ్రమ అని అనుకుంటుంది.
సౌందర్య, ఆనందరావు ఆదిత్య అన్న మాటలను తలుచుకుంటారు. అంతలోనే హిమ వచ్చి సౌర్య కు జ్వరం వచ్చింది అంటూ కంగారు పడుతూ చెబుతుంది. సౌర్య దగ్గరికి వెళ్లగా నాన్న కావాలి అంటూ నాన్న వస్తేనే జ్వరం తగ్గుతుంది అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
మొత్తానికి సౌర్య తన తండ్రి కోసం బెంగ పడుతూ తన తల్లిని ఆవిడ ఏది అని అనేసరికి వెంటనే సౌందర్య ఎవరు అని ప్రశ్నించగా.. వంటలక్క అనేసరికి సౌందర్య బాధపడుతూ దీప పడిన బాధల గురించి, దీపను బాధను పెట్టిన వాళ్ల గురించి మాట్లాడుతుంది.
తరువాయి భాగంలో ఇక దీప సౌర్య కు టాబ్లెట్లు ఇస్తున్న సమయంలో.. నాన్న వస్తారని అంటుంది. వెంటనే శౌర్య అబద్ధం చెప్పకు అమ్మ అంటూ నీ మీద ఇష్టం పోయింది అంటూ అనేసరికి దీప బాధపడుతుంది.
ఇక జైల్లో కార్తీక్ కడుపు నొప్పితో బాధ పడగా రత్న సీత కార్తీక్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు మోనిత ఇదంతా నా వల్లే కార్తీక్ అంటూ ముఖానికి చున్ని అడ్డు కట్టుకొని బయలుదేరినట్లు కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…