అలనాటి అందాల తారలు, నటీమణులు అయిన జయలలిత, జమున అందచందాలు, నటనా నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ నటీమణులు ఇద్దరూ ఎక్కువ ఆత్మాభిమానం కలవారు. ఆత్మాభిమాన విషయంలో ఈ ఇద్దరు తొందరగా రాజీపడరని చెప్పవచ్చు.ఈ ఆత్మ అభిమానం కారణంగానే జయలలిత హీరోయిన్ గా గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలలో నటించే అవకాశాలను కొంతకాలం పాటు వదులుకున్నారని చెప్పవచ్చు.
ఈ విధంగా ఎంతో ఆత్మాభిమానం ఉన్న ఈ స్టార్ హీరోయిన్లు ఇద్దరి మధ్య ఓసారి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా కొన్ని సంవత్సరాల పాటు దూరమయ్యారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కౌముది ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై మల్లెమాల సుందరరామిరెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “శ్రీకృష్ణ విజయం”. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు కృష్ణుడి పాత్రను పోషించారు.
ఈ సినిమాలో వసుంధర పాత్రలో జయలలిత, సత్యభామ పాత్రలో జమున నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా డైరెక్టర్ కామేశ్వరరావు వీరిద్దరికీ డైలాగ్ ఇచ్చి రిహార్సల్స్ చేయమన్నారు. ఇందులో మొదటగా జయలలిత చెప్పిన డైలాగ్ జమున తిరిగి సమాధానం చెప్పాలి. ఈ క్రమంలోనే జమున డైలాగ్ చెప్పండి అంటూ జయలలితను అడగగా అందుకు జయలలిత నేనెందుకు చెబుతాను.. మీరే చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో జమున ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే దర్శకుడితో జమున ఏంటండీ ఇది… ఆ అమ్మాయి డైలాగ్ చెప్పకపోతే నేనెలా రిహార్సల్స్ చేయాలి అంటూ అనగా అందుకు డైరెక్టర్ ఏ సమాధానం చెప్పలేదు. అదేవిధంగా దర్శకనిర్మాతలు జమునకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆరోజు వారిద్దరు సర్ది చెప్పడం వల్ల షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొంతకాలం వరకు వీరిద్దరి మధ్య మాటలు లేవని, ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం కొనసాగిందని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జమున తెలియజేశారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…