Karthikeya 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 సినిమా ఇష్యూ గురించి ఈయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా వాయిదా పడటం వెనుక దిల్ రాజు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిఖిల్ సైతం పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా నిఖిల్ తాను ఎక్కడ దిల్ రాజు పేరు ఉపయోగించలేదని ఈ సినిమా ఇంత మంచి విజయం అయిందంటే అందుకు దిల్ రాజే కారణం అంటూ ఒక్కసారిగా మాట మార్చారు.
ఇక ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుందంటే మరొక సినిమాని వాయిదా వేసుకోమని చెప్పడం ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు కూడా తన సినిమా విడుదలవుతుందని కార్తికేయ2 టీమ్ కి ఫోన్ చేసి సినిమా వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారని ఈయన వెల్లడించారు.ఈ విధంగా దిల్ రాజు వంటి వారి ఈ సినిమా వాయిదా వేసుకోమని ఫోన్ చేశారంటే నిజంగా నిఖిల్ ఎంతో గర్వపడాలని ఈయన వెల్లడించారు.
దిల్ రాజు గారు కార్తికేయ 2సినిమా హిట్ అవుతుందని ముందే ఊహించారు. అందుకే సినిమాని వాయిదా వేసుకోమని ఫోన్ చేసి ఉంటారని ఈయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా హిట్ కాదని తెలిస్తే వాయిదా వేసుకోమని చెప్పే అవసరం దిల్ రాజుకి ఉండదంటూ తెలిపారు. ఈ విధంగా దిల్ రాజు కార్తికేయ 2 సినిమా విజయవంతం అవుతుందని ముందే ఊహించి ఈ సినిమాకి భయపడి నిఖిల్ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారంటూ తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…