Imandi Ramarao : డిస్ట్రిబ్యూషన్ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న సుధాకర్ రెడ్డి గారి కొడుకుగా సినిమాల్లోకి వచ్చిన హీరో నితిన్ మొదటి సినిమా ‘జయం’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కొన్ని ప్లాప్ లు వచ్చినా వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘దిల్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘సై’ మంచి విజయాన్ని అందుకుంది. అయితే హిట్లకంటే ప్లాప్ లనే ఎక్కువ అందుకున్న నితిన్ కెరీర్ లో దాదాపు పదేళ్ళు విజయాలు లేవు. అయినా మళ్ళీ ‘ఇష్క్’ సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక నితిన్ ఇరవై ఏళ్ల సినిమా కెరీర్ గురించి సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఎనాలిసిస్ చేసారు.
కెరీర్ లో ఇబ్బందులకు ఆయనే కారణం…
ఇమంది రామారావు గారు నితిన్ కెరీర్ గురించి మాట్లాడుతూ అయన తండ్రి సుధాకర్ రెడ్డి గారికి సినిమాల మీద చాలా పట్టు ఉందని ‘యముడికి మొగుడు’ వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పారు. ఒకప్పుడు ఆయన సినిమా చూసి బాగుందన్నాడంటే సినిమా ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం దర్శక నిర్మాతలకు ఉండేదని చెప్పారు. అయితే కొడుకు సినిమాల సెలక్షన్ ఇప్పటికి సుధాకర్ రెడ్డి గారు చూస్తారు, సినిమా కోసం చాలా ఖర్చుపెడుతున్నారు కానీ సినిమా ఆయన అంచనాలను తప్పు చేస్తోంది. ఇప్పడున్న వారికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అంచనా వేయలేకపోతున్నారంటూ చెప్పారు. మంచి చేయాలనే అనుకుని కొడుకు కెరీర్ ను ఇబంధుల్లో పెడుతున్నారు.
ఇన్ని ఫెయిల్యూర్స్ తరువాత మళ్ళీ ఇష్క్ సినిమాతో హిట్ కొట్టాడు. మళ్ళీ ‘భీష్మ’ తరువాత వరుస ప్లాప్ లు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం కూడా ఘోరంగా నిరాశపరిచింది అంటూ వాఖ్యాణించారు. హీరో తరుణ్ విషయంలో కూడా తన తల్లి సినిమా కథ దగ్గరి నుండి సినిమాలో నటించే వాళ్లందరి గురించి అడగడం, వేలు పెట్టడం వళ్లే అతని కెరీర్ కూడా ప్రశ్నార్థకం అయింది. అయితే నితిన్ సినిమా విషయంలో ఇప్పటికీ మించి పోయింది లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుని కథల ఎంపిక విషయంలో నితిన్ కి స్వేచ్ఛ సుధాకర్ రెడ్డి గారు ఇస్తే బాగుంటుంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…