Karthikeya 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 సినిమా ఇష్యూ గురించి ఈయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా వాయిదా పడటం వెనుక దిల్ రాజు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిఖిల్ సైతం పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా నిఖిల్ తాను ఎక్కడ దిల్ రాజు పేరు ఉపయోగించలేదని ఈ సినిమా ఇంత మంచి విజయం అయిందంటే అందుకు దిల్ రాజే కారణం అంటూ ఒక్కసారిగా మాట మార్చారు.
ఇక ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుందంటే మరొక సినిమాని వాయిదా వేసుకోమని చెప్పడం ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు కూడా తన సినిమా విడుదలవుతుందని కార్తికేయ2 టీమ్ కి ఫోన్ చేసి సినిమా వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారని ఈయన వెల్లడించారు.ఈ విధంగా దిల్ రాజు వంటి వారి ఈ సినిమా వాయిదా వేసుకోమని ఫోన్ చేశారంటే నిజంగా నిఖిల్ ఎంతో గర్వపడాలని ఈయన వెల్లడించారు.
దిల్ రాజు గారు కార్తికేయ 2సినిమా హిట్ అవుతుందని ముందే ఊహించారు. అందుకే సినిమాని వాయిదా వేసుకోమని ఫోన్ చేసి ఉంటారని ఈయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా హిట్ కాదని తెలిస్తే వాయిదా వేసుకోమని చెప్పే అవసరం దిల్ రాజుకి ఉండదంటూ తెలిపారు. ఈ విధంగా దిల్ రాజు కార్తికేయ 2 సినిమా విజయవంతం అవుతుందని ముందే ఊహించి ఈ సినిమాకి భయపడి నిఖిల్ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారంటూ తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…